హైదరాబాద్: చిరంజీవి ఇప్పుడు రెండిటికి చెడ్డ రేవడిలా కన్పిస్తున్నాడు. తోటి ఎమ్మెల్యేలకు ఆయన పెద్ద నాయకుడిగా కన్పించడం లేదు. అదే విధంగా గతంలో వెండితెరపై హీరోగా చూసిన అనుభూతి కూడా చిరంజీవిని స్వయంగా చూస్తున్న ఎమ్మెల్యేలకు కలగడం లేదు.
ప్రజారాజ్యం నుంచి వలసలు ఆగడం లేదు. చివరికి చిరంజీవి ఒక్కరే మిగులుతారన్న వ్యాఖ్యలు బాగా వినిపిస్తున్నాయి. కానీ తాను మరో రౌండ్ ప్రజల్లోకి వెళ్తే సీన్ మారిపోతుందని చిరంజీవి అంటున్నారు. ప్రజారాజ్యం పార్టీకి సైద్ధాంతిక పునాదులు వేసినవారు ఇప్పుడు దూరంగా ఉంటున్నారు. వారు చెప్పిన మాటలనే చిరంజీవి చిలుకలా వల్లె వేస్తున్నారు. సినిమా స్టైల్ రాజకీయాల్లో పనిచేయదని ఎంతో మంది ప్రజారాజ్యం నాయకులు చెప్పి వెళ్ళిపోయారు. పవన్ కల్యాణ్,నాగబాబు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంత బాధలోనూ చిరంజీవి పార్టీ కార్యక్రమాలను ఒంటి చేత్తో నడిపిస్తున్నారు.&13;