clear
clear
clear
clear
x

జగన్ కు మరో షాక్!

  బుదవారం, అక్టోబర్ 21, 2009, 12:22[IST]
YS Jagan
Vote this article
Up  
Down  


హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్ కు ఇంకా ఆశాభంగమే ఎదురవుతోంది. సోనియా గాంధీ ఆయనకు ఈనెల 23 న ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైఎస్‌ మరణం వెనుక కుట్ర ఉందని జగన్‌ పత్రిక "సాక్షి"లో వచ్చిన కథనాలు సోనియా నిర్ణయానికి కార ణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాయి. సాక్షిలో వచ్చిన కథనమే జగన్ కు వ్యతిరేకంగా పరిణమించిందని సీనియర్ కాంగ్రెస్ నాయకుడొకరు అభిప్రాయపడ్డారు. వైయస్ హెలికాప్టర్ ప్రమాదం వెనుక అదృశ్య హస్తాలు ఉన్నట్టు సాక్షి కథనాలు ఉన్నాయి. కాంగ్రెస్ హై కమాండ్ "హస్తం" కూడా ఉండవచ్చన్న సంకేతాలు ఈ కథనాల ద్వారా జనంలోకి వెళ్ళాయి. సాక్షి కథనాలను సోనియా గాంధీ ఆంగ్లంలోకి అనువదించుకుని చదువుకుని జగన్ కు అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకున్నట్టు ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి.

"రాష్ట్రం నుంచి సమాచారం ఎప్పటికప్పుడు సోనియాకు చేరుతోంది. బహుశా ఈ కథనం కూడా మేడమ్‌ దృష్టికి వచ్చి ఉండవచ్చు. అందువల్లే ఆమె జగన్‌తో భేటీని తిరస్కరించి ఉంటారు. జగన్‌కు ఏ స్థాయిలోనూ ప్రాధాన్యం లభించడం ఇష్టంలేని కొన్ని శక్తులు కూడా అధిష్ఠానం మనసు మార్చి ఉండవచ్చు" అని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. వైఎస్‌ మరణానంతరం జగన్‌ వర్గం చేసిన హడావుడి నచ్చకే సోనియా వారిని ఇన్నాళ్లూ పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. సోనియా మొదటినుంచీ పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేరీతిలో వ్యవహరించేవారికి ప్రాధాన్యం ఇవ్వకూడదన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత నిర్ణయానికీ అదే కారణమయ్యే అవకాశాలున్నాయి.

సోనియా అపాయింట్ మెంట్ రద్దు అయినా జగన్ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. తండ్రి వైయస్ మరణించిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్ళడం ఇదే మొదటిసారి. ఎంపీగా ఒక స్ధాయీ సంఘం సమావేశంలో పాల్గొనడానికి ఆయన వెళ్ళినట్టు తెలుస్తోంది. సోనియా అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించిన కెవిపి రామచంద్రరావుకు కూడా నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. ఇలా ఉండగా కెవిపి రామచంద్రరావు హైకమాండ్ ఆదేశం మేరకు రోశయ్యకు సన్నిహితంగా మారారన్న అనుమానం జగన్ వర్గీయుల్లో ఉంది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: seshavatharam
తేదీ: 28 Oct 2009 6:42 pm
నేను సాక్షి లో చదివిన రెండు ఇతెంస్ మొదలో పేజిలోను మధ్య పేజీలోను ఉన్నాయ్. ఎలెక్షన్ అయినతరువాత వై శ్ అయెదు సంవత్సరాలు పాలనా చేయదు ఎదుపులపయకే పోతాడు అని ఒక ప్రముఖ రాజకేయవేత్త చెప్పిన భవిష్యవాణి పై మీ అబిప్రాయం

పోస్ట్ చేసినవారు: విజయ్
తేదీ: 26 Oct 2009 5:21 pm
వైయస్ ఉన్నాంత కలం వాడుకుని వదిలేసారు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అండ్ అడిస్తనం కాంగ్రెస్ రొండు ఇప్పుడు మాజీ లు ఏమి చేయరు చేయనివారు ఎవరిని కుర్చుని పుల్లలు పెట్టటం తప్ప

[ Post Comments ]
  Other News
  Videos