హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వైయస్ జగన్ కు ఇంకా ఆశాభంగమే ఎదురవుతోంది. సోనియా గాంధీ ఆయనకు ఈనెల 23 న ఇచ్చిన అపాయింట్ మెంట్ రద్దు కావడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. వైఎస్‌ మరణం వెనుక కుట్ర ఉందని జగన్‌ పత్రిక "సాక్షి"లో వచ్చిన కథనాలు సోనియా నిర్ణయానికి కార ణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశాయి.
హైదరాబాద్: తండ్రిని కోల్పోయి, వ్యాపారాల్లో నష్టపోయి భోరున విలపిస్తున్న జగన్ ను ఆదుకోడానికి జూనియర్ ఎన్టీఆర్ ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. వరద బాధితుల కోసం తాత గారిలా ఉదారంగా వ్యవహరించిన జూనియర్ రాజకీయాల విషయంలో తాతగారి కంటే నిక్కచ్చిగా ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నట్టు చెబుతున్నారు. తెలుగుదేశం అధికారంలోకి రానప్పటినుంచి చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తో అంటీ ముట్టనట్టు
హైదరాబాద్:రోశయ్య మరో రెండున్నరేళ్ళు, ఆ తర్వాత ఎన్నికల ముందు జగన్ రెండేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండడానికి రాజీ ఫార్ములా కుదిరిందా? ఈ విషయం బయటికి పొక్కకపోయినా వీరప్ప మొయిలీ, కెవిపి రామచంద్రరావుల మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. కానీ ఇందుకు జగన్ వర్గీయులు అంగీకరించడం లేదట. పదవిని ఎంజాయ్ చేయడానికి ఒకరు, ఎన్నికల ముందు పార్టీని గెలిపించడానికి మేమా
ఉండవల్లి అరుణ్ కుమార్ కు అపర చాణుక్యుడు అన్పించుకోవాలని ఆరాటం. రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్ పై అన్ని రకాల పోరాటాలు చేయడం ద్వారా ఆయన ఆ పేరును చాలా వరకు సార్ధకం చేసుకోగలిగారు. వైఎస్ తో ఆయనకున్న అనుబందం మాటల్లో చెప్పలేనిది. తెలుగుదేశంపై పోరాటంలో వైఎస్ కు ఐడియాలు అందించినవారిలో ఉండవల్లి అగ్రగణ్యుడు. ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా
హైదరాబాద్: రాజశేఖరరెడ్డి పదేళ్ళ క్రితం తన నాయకత్వంలోని కాంగ్రెస్ కాకుండా చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం విజయం సాధించినప్పుడు నిస్పృహకు లోనయ్యారు. రాజకీయ నాయకులు అరవై ఏళ్ళకు రిటైరైతే బాగుంటుందని, తాను కూడా అలా చేస్తానని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పుడు రాజశేఖరరెడ్డికి అరవై ఏళ్ళు నడుస్తున్నాయి. గత వారమే ఆయన పుట్టిన రోజు జరుపుకున్నారు. మరి ఆయన రిటైర్మెంట్