clear
clear
clear
clear
x

సోనియా గాంధీకి నిక్కచ్చిగా చెప్పిన రోశయ్య

  శనివారం, నవంబర్ 7, 2009, 12:38[IST]
Sonia Gandhi
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రోశయ్య శనివారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశమై రాష్ట్రంలోని పరిస్ధితులను ఆమెకు నిక్కచ్చిగా వివరించారు. రెండు నెలల తర్వాత ఢిల్లీకి వచ్చిన సీఎం రోశయ్యకు ఇది అత్యంత కీలక సమావేశంగానే చెప్పవచ్చు. ప్రధానంగా సిఎల్పీ సమావేశం, మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ, తాజాగా రాష్ట్ర రాజకీయ పరిస్థితులు తదితర వాటిపై చర్చలు జరిగినట్టు సమాచారం. జగన్ వ్యవహారంపై కూడా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సీనియర్ నాయకుడిగా రోశయ్య జగన్ గురించి ఎటువంటి నెగిటివ్ విషయాలు సోనియాకు చెప్పలేదని తెలుస్తోంది. నేటి సాయంత్రం జగన్ తన కుటుంబ సభ్యులతో సోనియా గాంధీని కలుసుకోనున్నారు.

అంతకు ముందు రోశయ్య కేంద్ర హోంమంత్రి చిదంబరంతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి మరిన్ని కరువు నిధులు ఇవ్వాలని కోరినట్లు, అలాగే మిగిలిన 500 కోట్ల రూపాయల కరువు నిధిని విడుదల చేయాలని కోరినట్లు చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో సోనియాగాంధీ అధ్యక్షతన కోర్‌ కమిటీ జరుగుతుందని చిదంబరం చెప్పినట్లు రోశయ్యపేర్కొన్నారు.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: ట్రూ ఇస్ కరెక్ట్
తేదీ: 07 Nov 2009 11:11 pm
బాగా చెప్పావు ట్రూ ..ఎక్ష్కెల్లెన్త్

పోస్ట్ చేసినవారు: true
తేదీ: 07 Nov 2009 10:13 pm
ఒక్క మాట చెప్పు రోస్సయ్య నువ్వు కష్టపడ్డావా ఎలేచ్షన్స్ కోసం ... రాజశేఖర్ అన్న కదా రాత్రి పగలు కాస్త పడింది నువ్వు ఆకరికి అసెంబ్లీ కి కూడా పోటి చేయలేఖ కూర్చున్నావ్ ..... మరి నీకు ఎంత మాత్రం గౌరవం చెప్పు .... సొమ్ము ఒకరిది సోకు ఒకరిడా .... న్యాయం జరగాలి గ జగన్ కి ..........................!!!!!!!

[ Post Comments ]
  Other News
  Videos