హైదరాబాద్: పీవీ ఎక్స్ప్రెస్ వేపై తొలి ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న మూడు కార్లు అదుపు తప్పి బోల్తా పడడంతో నూతనంగా ప్రారంభించిన ఎక్స్ప్రెస్ వేపై తొలి ప్రమాదం సంభవించినట్లైంది. ఈ ఘటనలో నలుగురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
పివి నరసింహారావు ఎక్స్ ప్రెస్ వే కు అక్టోబర్ 19 న ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు. ఈ ఎక్స్ ప్రెస్ మార్గం 11.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దేశంలో అతి పొడవైన ఫ్లైవోవర్ మార్గం. శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకెళ్లే మార్గమిది.
మరిన్ని వివరములు:
సంబంధిత వార్తలు