clear
clear
clear
clear
x

వందేమాతరం పై ఫత్వా నాకు తెలియదు: చిదంబరం

  బుదవారం, నవంబర్ 4, 2009, 18:37[IST]
Chidambaram
Vote this article
Up  
Down  


న్యూఢిల్లీ: వందే మాతర గీతాలాపనపై జమైత్ ఉలేమా - ఎ - హింద్ ఫత్వా జారీ చేసినట్లు వచ్చిన వార్తలను కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం ఖండించారు. తన సమక్షంలో ఆ సంస్థ తన సర్వసభ్య సమావేశంలో ఆ మేరకు ఏ విధమైన తీర్మానం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. చిదంబరం ఆ సమావేశంలో నవంబర్ 3వ తేదీన ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్నారని, ఆయన మాట్లాడుతున్నప్పుడు అటువంటి ఫత్వా జారీ చేసినట్లు ఆయనకు తెలియదని చిదంబరం సహాయకుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

చిదంబరం ముందే సిద్ధం చేసుకున్న ప్రసంగ పాఠాన్ని చదివారని, దాని నుంచి విడిగా మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని అన్నారు. చిదంబరం సమక్షంలో జమైత్ వందే మాతరం గీతాన్ని ఆలపించకూడదని బిజెపి నాయకులు చేసిన విమర్సకు వివరణ ఇస్తూ ఆ ప్రకటన వెలువడింది.



User Comments
[ Post Comments ]
పోస్ట్ చేసినవారు: రఘు
తేదీ: 05 Nov 2009 1:36 pm
ఆయనకీ ఎలా తెలుస్తుంది? సోనియా గాంధీ _________ నాకటం తప్ప ? మైనారిటీ వాళ్ళు మన దేశం లో ఏమి అయిన చేయ వచ్చు. ఎందు కంటే మెజారిటీ వాళ్ళు కాంగ్రెస్ కే వోట్ వేస్తున్నారు. రేపు జనగణమన కూడా పాదము అంటారు మనము నోరు అన్ని మూసుకొని పది వుంటాము

పోస్ట్ చేసినవారు: సామాన్యుడు
తేదీ: 05 Nov 2009 8:53 am
కొన్ని పదుల ఎలక్ట్రానిక్ మీడియా, దాదాపు అన్ని ప్రింట్ మీడియా లలోను ప్రత్యక్షమయిన వార్తా ఇది , మరి నాకెందుకు కనబడలేదు????? మరదే రాజకీయాలలో ప్రదమ పాఠం,

[ Post Comments ]
  Other News
  Videos