హైదరాబాద్: హైదరాబాదులోని ఎల్బీ స్టేడియం హాస్టల్లో బాక్సింగ్ క్రీడాకారిణి అమరావతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాదులోని చింతల్ బస్తీకి చెందిన ఆమె మంగళవారం రాత్రి స్పోర్ట్స్ హాస్టల్ లో విషం సేవించి అత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని విచారణ ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు.
అమరావతి అత్యహత్యకు కారణాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ చెప్పారు. కాగా, కలుషితాహారం తినడం వల్ల ఆమె మరణించి ఉంటుందా అనే కోణం నుంచి కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంఘటన హైదరాబాదులో తీవ్ర సంచలనం కలిగించింది.
మరిన్ని వివరములు:
అమరావతి
హైదరాబాద్
ఎల్బీ స్టేడియం
సంబంధిత వార్తలు