కుటుంబం ఆత్మహత్యాయత్నం: ఇద్దరు మృతి
బుదవారం, నవంబర్ 4, 2009, 18:02[IST]
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని రంగనాయకులపేటలో సాగు ప్రభాకర్ అనే వ్యక్తి కుటుంమంతా ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. దీంతో ప్రభాకర్ తో పాటు అతని భార్య వెంకటరత్నమ్మ అక్కడికక్కడే మరణించారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతని ఇద్దరు కుమారులను ఆస్పత్రికి తరలించారు.
వారిద్దరిలో ఒకరి పరిస్థితి ఆందోళనాకరంగా ఉంది. సంఘటనా స్థలంలో పోలీసులకు ఒక లేఖ కనిపించింది. తమ చావుకు ఎవరూ కారణం కాదని ప్రభాకర్ ఆ స్యూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వివరములు:
నెల్లూరు
ఆత్మహత్య
ప్రభాకర్
సంబంధిత వార్తలు