హైదరాబాద్: బలహీనపడింది కాబట్టే కాంగ్రెసు పార్టీ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీతో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటుందని తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాదులోని జరిగిన అభివృద్ధి అంతా తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పాలనలో హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని స్పష్టంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెసు పార్టీ అంతర్గత వివాదాల వల్ల బలహీనపడిందని తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి అరవింద కుమార్ గౌడ్ అన్నారు. అంతర్గత తగాదాల కారణంగానే కాంగ్రెసు ప్రజారాజ్యంతో పొత్తు పెట్టుకుంటోందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమ పార్టీని ఓడించే సత్తా లేకనే కాంగ్రెసు ప్రజారాజ్యంతో జత కట్టిందని ఆయన అన్నారు. ప్రజారాజ్యం పార్టీకి ప్రజాదరణ లేదని ఆయన అన్నారు.
మరిన్ని వివరములు:
నాగం జనార్దన్ రెడ్డి
తెలుగుదేశం
కాంగ్రెసు
సంబంధిత వార్తలు