విజయవాడ: కృష్ణా జిల్లా గుడివాడ తెలుగుదేశం శాసనసభ్యుడు కొడాలని నానిపై కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీ చేసింది. ఆయనతో పాటు పది మందిపై కోర్టు మంగళవారం ఈ వారంట్ జారీ చేసింది. వారిని ఈ నెల 17వ తేదీలోగా అరెస్టు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. తమ ముందు హాజరు కాకపోవడంతో కోర్టు వారిపై ఈ వారంట్ జారీ చేసింది.
గుడివాడలో శిలా ఫలకాల ధ్వంసం చేసినందుకు కొడాలని నానిపై, మరో 9 మందిపై కేసు నమోదైంది. ప్రోటోకాల్ ను పాటించకుండా పలు కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేసినందుకు నిరసనగా కొడాలి నాని, ఆయన అనుచరులు ఇటీవల శిలాఫలకాలను ధ్వంసం చేశారు.
మరిన్ని వివరములు:
కొడాలి నాని
తెలుగుదేశం
విజయవాడ
సంబంధిత వార్తలు