హైదరాబాద్: జరుగుతున్న సంఘటనలు వైయస్ జగన్ కే ఎక్కువ నష్టం కలిగిస్తాయని కాంగ్రెసు సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అన్నారు. రాష్ట్రంలో సంభవిస్తున్న పరిణామాలను పార్టీ అధిష్ఠాన వర్గం ఎప్పటికప్పుడు తెలుసుకుంటోందని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. బెదిరింపులు చేయడం మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. వి.హనుమంతరావును సీనియర్ కాంగ్రెసు నేత ఎం.సత్యనారాయణ రావు కలిశారు. బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిసి హనుమంతరావును పరామర్ఛించేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు.
పార్టీలో ఇదివరకు అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు ఆ స్వేచ్ఛను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి ఎవరైనా తమకు ఒక్కటేనని, పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.