న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఏదో విధంగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు రైల్వే మంత్రి మమతా బెనర్జీని కలిసి వినతిపత్రం సమర్పించారు. సోమవారం అప్పాయింట్ మెంట్ ఇచ్చినా ఎందుకు రాలేదని మమతా వారిపై తొలుత ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇప్పుడు కలవడం సాధ్యం కాదని ఆమె చెప్పారు. అయితే మమత అప్పాయింట్ మెంటు ఇవ్వలేదనే వార్తలు రావడంతో కాంగ్రెసు ఎంపీలు పార్లమెంటు లాబీలో ఆమెను కలిసి వినతిపత్రం సమర్పించారు. వారికి ఆమె ఈ విధమైన హామీ ఇవ్వలేదు. ఆమెతో చర్చించడానికి వారికి అవకాశం చిక్కలేదు.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్లమెంటు సభ్యులను కలవడానికి రైల్వే మంత్రి మమతా బెనర్జీ మంగళవారం తొలుత నిరాకరించారు. రైల్వే బడ్జెట్ లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించేందుకు వెళ్లిన వారికి ఆమె వద్ద చుక్కెదురైంది. సోమవారంనాడు ఎందుకు రాలేదని ఆమె కాంగ్రెస్ ఎంపీలను అడిగారు. చివరకు మొక్కుబడిగా వారు మమతా బెనర్జీకి రైల్వే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై వినతిపత్రం సమర్పించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెసు ఎంపీల కన్వీనర్ గా పొన్నం ప్రభాకర్ ఎన్నికయ్యారు. పొన్నం ప్రభాకర్ కరీంనగర్ లోకసభ స్థానం నుంచి విజయం సాధించారు.
మరిన్ని వివరములు:
mamata
railway budget
congress
Related news