హైదరాబాద్: పీఆర్పీ నేతలు నోటిని అదుపులో పెట్టుకుంటే మంచిదని టీఆర్ఎస్ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షురాలు విజయశాంతి హెచ్చరించారు. తెలంగాణవాదం తగ్గిపోయిందంటూ ప్రజారాజ్యం పార్టీ నేతలు వ్యాఖ్యానించడంపై ఆమె మండిపడ్డారు. సమైక్యవాదంతో ఉన్న ఆ పార్టీ నేతలకు తెలంగాణ వాదం గురించి మాట్లాడే నైతిక హక్కులేదని అన్నారు.
గురువారం సాయంత్రం తెలంగాణ భవన్లో జరిగిన పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం బలోపేతానికి కార్మికులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో తెలంగాణ వాదం లేదని మీరు భావిస్తున్నారా? అని మీడియా ప్రతినిధులు ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి శివశంకర్ ప్రశ్నించగా "అవునయ్యా...ఆ వాదం పడిపోతోంది కదా? బాగా క్షీణించింది కదా! టీఆర్ఎస్ ఏమైందో చూడండి. ఎక్కడుంది టీఆర్ఎస్?" అని వ్యాఖ్యానించారు.దానిపై టీఆర్ ఎస్ తీవ్ర స్ధాయిలో స్పందించింది. ఇక 12వ తేదీన నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విజయశాంతి రోడ్ షో జరగనుంది.
మరిన్ని వివరములు:
vijayashanti talli telangana hyderabad సత్యభామా? జండుబామా?టీఆర్ఎస్లో 'తల్లితెలంగాణ'విజయశాంతికి రెండు'పాత్రలు'vijayashanti, trs, telangana, kcr, hyderabadకెసీఆర్ కు రేపు రాత్రి విజయశాంతి విందువిజయశాంతి నిర్ణయం వెనుక?విజయశాంతి పార్టీ విలీనం 30న చిరంజీవి పరువు తీస్తున్నారా?రంగారెడ్డిలో చిరు సాయం సభలు 'సత్యం'పై అంత ప్రేమా?హీరోయిన్ మాధవి ప్రజారాజ్యంలోకి?పవన్కల్యాణ్ అరెస్టు Related news'పరమ బోర్ చక్ర' వైజయంతిటీఆర్ఎస్లో 'తల్లితెలంగాణ'నర్సాపురం లేదా తిరుపతి నుంచి 'చిరు'