న్యూఢిల్లీ: ద్రవ్యోల్బణం రెండంకెలకు పెరుగుతుందని మంత్రివర్గ సమావేశంలో ఊహించిందేనని కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం అన్నారు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెంచడంతో వ్యోల్బణం పెరిగిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. డిమాండ్, సరఫరాకు మధ్య అంతరాన్ని తగ్గించడానికి పటిష్టమైన ద్రవ్య, ఆర్థిక చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రస్తుతం గడ్డు కాలమేనని ఆయన అన్నారు.
ద్రవ్యోల్బణంలో 94 శాతం పెరుగుదల పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల వల్లనే జరిగిందని ఆయన అన్నారు. పరిస్థితిని అంచనా వేయడానికి పెట్రోలియం కార్యదర్శి ఎం.ఎస్. శ్రీనివాసన్, ఆర్థిక కార్యదర్శి డి. సుబ్బారావులతో తాను సమావేశమైనట్లు ఆయన తెలిపారు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచితే ద్రవ్యోల్బణం పెరుగుతుందని తాము ముందే అనుకున్నామని ఆయన చెప్పారు.
మరిన్ని వివరములు:
finance minister ఎన్టీఆర్ అంటే భయం: రోశయ్యప్రణబ్ కు ఆర్థికం: హోం చిదంబరానికేతెలంగాణపై నిర్ణయం కేంద్రానిదే: రోశయ్యప్రణబ్ బడ్జెట్ ఎన్నో ఆశలు Related newsజైలుకెళ్లాల్సిందే కదాని..రోశయ్య