ఎన్టీఆర్ సలహాపై దిల్ రాజు..
శుక్రవారం, అక్టోబర్ 16, 2009, 11:33[IST]
వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందనున్న బృందావనం చిత్రం కోసం హీరోయిన్ సెర్చింగ్ జరుగుతోంది. ఇందుకోసం కొత్త అమ్మాయిని పరిచయం చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నారు. పెద్ద హీరోయిన్స్ డేట్స్ కోసం వెయిట్ చేయటం కన్నా ఈ పద్దతే బెటరని ఎన్టీఆర్ సలహా ఇచ్చిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకునట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి ధమస్ సంగీతం అందిస్తున్నారు. ధమస్ లేటెస్ట్ గా జయీభవ చిత్రానికి పనిచేసారు. అంతకుముందు ఆంజనేయులు,కిక్ చిత్రాలకు అతను సంగీతం అందించారు. అలాగే మున్నా చిత్రంతో టెక్నికల్ గా తానేమిటో నిరూపుంచుకున్న వంశి ఈ చిత్రాన్ని ఓ రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అలాగే ఈ చిత్రం వచ్చే నెల నుండి సెట్స్ మీదకు వెళ్ళనుంది. ఈ చిత్రం టైటిల్ కు గోవిందుడు అందరి వాడేలే అనే ట్యాగ్ లైన్ ఉంది.
మరిన్ని వివరములు:
జూ ఎన్టీఆర్
దిల్ రాజు
బృందావనం
Related news