క్రిష్ తాజాగా చేస్తున్న వేదం చిత్రం(14 జనవరి 2010) సంక్రాంతికి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.ఈ వారంలో చివరి షెడ్యూల్ జరుగుతోంది.దాంతో సినిమా దాదాపు పూర్తయినట్లే. ఆర్కా మీడియా వర్క్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్,అనూష్క,మనోజ్ మంచు,మనోజ్ బాజ్ పాయ్ నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వేదం ఓ కమర్షియల్ ఎలెమెంట్స్ కలిగిన కాన్సెప్ట్ ఫిల్మ్ గా చెప్తున్నారు. గమ్యంతో క్రిష్ మంచి పేరు తెచ్చుకోవటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అలాగే అల్లు అర్జున్, అనూష్క, మంచు మనోజ్ కుమార్ కలిసి ఒకే సినిమాలో నటించటం ఇదే మొదటిసారి.
మరిన్ని వివరములు:
అల్లు అర్జున్
అనుష్క
అల్లరి నరేష్
Related news