మహారాష్ట్రాలో ఎన్నికల వేడి ఊపందుకుంది. దీనికోసం ఓటర్ కార్డులు లేని ప్రముఖులంతా ఓక్కసారిగా భయటకొచ్చారు. దాంతో ఆన్ లైన్ లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తాజాగా ఆన్ లైన్ ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
అక్కడి డిప్యూటి ఎలక్షన్ ఆఫీసర్ సంజయ్ భగవత్ మాట్లాడుతూ అందాల తార ఐశ్వర్యరాయ్ కు ఓటరు కార్డు ఇవ్వలేదు. దానికి కారణం ఐష్ పుట్టినతేది వివరాలు సమర్పించలేదట. ఆ వివరాలు అందించిన తర్వాతే ఓటరు కార్డు నమోదు చేస్తారు. ఆ విషయం పాపం ఐష్ కు (తెలుసు) తెలియదు. ఐష్ తో పాటు ఇంకా బాలీవుడ్ తారలు అక్షయ్ కుమార్, ప్రీతిజింటా, కిమ్ శర్మ, సోనమ్ కపూర్ తదితరులు ఓటరు కార్డుకు దరఖాస్తు చేసుకున్నారు.